కార్వేటి నగరం ఆగస్టు 11 గరుడదాద్రి న్యూస్
కార్వేటినగరంలోని రాజకుమారస్వామి రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రారంభమై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పుత్తూరు డివిజన్ ఉపవిద్యా శాఖ అధికారి ఉమా మహేశ్వర్ రావు మాట్లాడుతూ ఈ శిక్షణ వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న వాటిని అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు చక్కగా విద్య బోధించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు, సిడిపిఓ శోభారాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రోజా రమణి, జిల్లాస్థాయి విషయ నిపుణులు కరణం గిరిబాబు, జయశ్రీ, మహేష్ మరియు అంగన్వాడి 68 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.