అనారోగ్యంతో బాధపడుతున్న వైకాపా నాయకుడికి ఆర్థిక సహాయం అందించిన ఎం.పి.పి.మొగశాల రెడ్డెప్ప
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్4 బైరెడ్డిపల్లి మండలం లోని పెద్దచెల్లారగుంట పంచాయితీ తాతిరెడ్డి పల్లి లో గత నెల నుంచి వైకాపా నాయకుడు అనారోగ్యం తో బాధపడుతున్నారు.ఈ సంఘటన సమాచారం మండల ఎం.పి.పి.మొగశాల రెడ్డెప్పకు తెలియడంతో స్పంధించి గురువారం బాధితుడి స్వగృహంకు విచ్చేసి ఆయన యోగక్షేమాలు తెలుసుకొనివారి కుటింభికులు కు ఆర్థిక సహాయం చేసి దాతృత్వం చాటుకున్నారు.దీనితో బాధితుడు కుటింభికులు రెడెప్ప కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.