రైతన్నల పక్షపాతి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
-ఉనికి కోసమే వైకాపా నిరసనల పేరుతో డ్రామాలాడుతోంది..
-వైసిపి నేతల ఆరోపణలను ఖండించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
గరుడధాత్రి న్యూస్ :
మామిడి రైతుల కష్టాన్ని గుర్తించి, ముందు చూపుతో నాలుగు రూపాయల సబ్సిడీని ప్రకటించి, అన్నదాతకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కూటమి సర్కార్ అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కొనియాడారు. రైతన్నల పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారని, సీఎం చిత్తశుద్ధికి ఇది నిదర్శనమంటూ ప్రశంసించారాయన.
ఉనికి కోసమే వైకాపా నిరసనల పేరుతో డ్రామాలాడుతోందని విమర్శించారు.
మామిడి రైతులకు మద్దతుగా పూతలపట్టు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన నిరసనలను మీడియా ద్వారా తెలుసుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..,బుధవారం ఢిల్లీ నుంచి ఓ ప్రకటనలో స్పందించారు. కూటమి ప్రభుత్వ పాలనను చూసి ఓర్వలేకనే.., వైసిపి నేతలు నిరస