GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 5:13 am Digital Edition : GURU SWAMY

ఇంటర్ విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు పంపిణీ

కార్వేటినగరం ఆగస్టు 11 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం మండల కేంద్రంలో ఉన్న రాజా కుమార్ స్వామి రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ చదువుతున్న వారికి యూనిఫాం దుస్తులను గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ బాధ్యులు మరియు మాల ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు యుగంధర్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ స్వరూప ఆధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాల చదువుతున్న ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి కళాశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
చిత్తూరు కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సహాకారంతోయూనిఫామ్ లు అందజేసిన.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గం యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, యువజన కార్యదర్శి అన్నామలై, మండల ప్రధాన కార్యదర్శి ప్రతాప్, జనసేన పార్టీ SR పురం మండల ఐటి కోఆర్డినేటర్ మురగేష్, ఉపాధ్యక్షులు సెల్వి, విజయ్, టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్ నియోజకవర్గం బూత్ కన్వీనర్ యతిశ్వర్ రెడ్డి, జనసేన సీనియర్ నాయకులు శేఖర్, కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.