GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 11:27 am Digital Edition : GURU SWAMY

ఊర్వి శర్మ ను సన్మానించిన నారా భువనేశ్వరి

కుప్పం,జులై 30 (గరుడ ధాత్రి న్యూస్):
రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో విజయం సాధించిన కుప్పం కు చెందిన ఊర్వీశర్మను సీఎం సతీమణి నారా భువనేశ్వరి సన్మానించారు.
కుప్పం మున్సిపాలిటీ 19వ వార్డుకు చెందిన ఊర్వి శర్మ జరిగిన 6వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్లో విజయం సాధించింది. అలాగే ఆమె మైసూర్లో 29వ ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడలు మరియు బ్రౌన్ మెడల్ దక్కించుకున్నది.ఈ సందర్భంగా భువనేశ్వరి 3వ తరగతి చదువుతున్న ఊర్వి శర్మ ఆ చిన్నారిని భువనేశ్వరి ఇంట్లో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో కౌన్సిలర్ దామోదరం నాయుడు, మైనార్టీ అధ్యక్షుడు జాకీర్ మరియు తెలుగుదేశం నాయకులు సుగుణమ్మ, రాధమ్మ, ఊర్వి శర్మ చిన్నారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.