కార్వేటినగరం ఆగస్టు 1 గరుడ దాద్రి న్యూస్
తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ సూచనల మేరకు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ పరిశీలకులు జయ ప్రకాష్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంగల్రాయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.కార్వేటినగరం మండలం పొన్నగల్లు గాదంకి పంచాయతీలలో వారు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణాపురం జలాశయం అధ్యక్షులు అన్నామలై బీగాల రమేష్ మార్కొండ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి హేమాద్రి తదితర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు