GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 6:31 pm Posted by : GURU SWAMY

ఎన్డీఏ కూటమి విజయోత్సవ ర్యాలీకి బయలుదేరిన టిడిపి నేతలు

ఎన్డీఏ కూటమి రెండేళ్ల విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు పలువురు టిడిపి నేతలు బయలుదేరి వెళ్లారు. సూళ్లూరుపేట పట్టణంలో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ల ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు నాయుడుపేట మండలంలోని కాపులూరు గ్రామం నుండి టిడిపి నేత కాపులూరు చక్రపాణి,పెరికలంపాటి కండ్రిగ గ్రామం నుండి టిడిపి నేత బల్లి ముత్యాలయ్య ల ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు సూళ్లూరుపేట విజయోత్సవ ర్యాలీకి బయలుదేరి వెళ్లారు.