ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు రూ.కోటి విరాళం
టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేద రోగులకు ప్రాణదాతగా సేవలందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్కు హైదరాబాద్లోని షేక్పేట్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ శ్రీ అన్నే శ్రీనివాసరావు రూ.1 కోటి విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డిడిని ఆదివారం తిరుపతిలోని టీటీడీ ఈవో నివాస కార్యాలయంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర కు అందించారు. ఈ సందర్భంగా ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు ఉదారంగా రూ.కోటి విరాళం అందించిన దాత శ్రీ అన్నే శ్రీనివాసరావును ఈవో అభినందించి, వారి సేవాభావాన్ని ప్రశంసించారు....