GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 5:59 am Digital Edition : GURU SWAMY

ఏఎస్ఐ జ్యోతిని పరామర్శించిన ఎమ్మెల్యే మురళీమోహన్

పూతలపట్టు ఆగస్టు 10 (గరుడ దాత్రి న్యూస్)

సోమవారం జరిగిన వైసిపి ధర్నాలో వైసిపి నేతలు ఏ ఎస్ ఐ జ్యోతిని నెట్టి వేయడంతో ఆమె కింద పడిపోయి తలకు గాయం అయింది ప్రస్తుతం ఆమె పి కొత్తకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చికిత్స పొందుతున్నది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆసుపత్రికి వెళ్లి ఏఎస్ఐ జ్యోతిని పరామర్శించారు. ధర్నాలో జరిగిన విషయాన్ని ఎమ్మెల్యేకి జ్యోతి తెలియజేసింది ధైర్యంగా ఉండమని ఎమ్మెల్యే తెలియజేశాడు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు.నీకు న్యాయం చేయమని ఎస్పీ కి తెలియజేశానని ఎమ్మెల్యే తెలిపాడు.ఎమ్మెల్యే తో పాటు మండల కన్వీనర్ దొరబాబు చౌదరి. మాజీ కన్వీనర్ చంద్రమౌళి. బిజెపి. జనసేన అధ్యక్షుడు ప్రసాద్. మనోహర్ నాయకులు ఉప్పలపాటి బాబురావు. గంగారపు గోపి. గుంటూరు మురళి నాయుడు. గోపి యాదవ్ పెద్దపాలెం నాగరాజు. నేతాజీ నాయుడు. తదితరులు ఉన్నారు