పూతలపట్టు ఆగస్టు 10 (గరుడ దాత్రి న్యూస్)
సోమవారం జరిగిన వైసిపి ధర్నాలో పోలీసులకు×వైసీపీ నాయకులకు జరిగిన తోపులాటలో ఏ ఎస్ ఐ జ్యోతిని నాయకులు నెట్టి వేయడంతో ఆమె కింద పడిపోయి తలకు గాయం అయింది ఆమె నేను ఆ సంఘటన చూసి ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఉన్నానని నేను ఏమైనా అయిపోతానని భయపడ్డానని ఆ విధంగా ఆవేశంతో నాయకులు కార్యకర్తలు తోసి వేయడం జరిగిందని కన్నీరు మున్నీరుగా ఈ కొత్తకోట ఆసుపత్రిలో ఎమ్మెల్యే మురళీమోహన్ ఎదుట ఆవేదన చెందింది ఇలాంటి సంఘటనలో నాకు 25 ఏళ్ల సర్వీసులో చూడలేదని ఆమెతెలిపింది.శాంతియుతంగా ర్యాలీ చేయండి కొంతమందికి మాత్రమే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి అనుమతులు ఇస్తామని చెప్పిన వైసిపి నాయకులు వినకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆమె ఆవేదన చెందింది.