కాణిపాకం వరసిద్ధిని సేవలో సినీహీరో సాయిధర్మతేజ్
కాణిపాకం ఆగస్టు 17 (గరుడ దాత్రి న్యూస్) సినీ హీరో సాయిధర్మ తేజ్ సోమవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు శివ ప్రసాద్, ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు ఉన్నారు.