GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 7:43 pm Posted by : GURU SWAMY

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న పంచాయతీరాజ్ శాఖ ఈఎన్‌సీ బాలు నాయక్

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న పంచాయతీరాజ్ శాఖ ఈఎన్‌సీ బాలు నాయక్

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) శ్రీ బాలు నాయక్ గారు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనం అనంతరం దేవస్థానం చైర్మన్ శ్రీ మణి నాయుడు గారు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం మరియు స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండ్లు వాసు, కోదండపాణి, టీడీపీ మండల అధ్యక్షుడు గంగారపు హరిబాబు నాయుడు, పంచాయతీరాజ్ ఈఈ నవీన్, డీఈ ప్రసాద్ నాయుడు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.