GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 8:21 am Digital Edition : GURU SWAMY

కాణిపాకం స్వామివారికి రూ. 38 లక్షల వెండి ఆభరణాలు బహుకరించిన భక్తులు

కాణిపాకం ఆగస్టు 1(గరుడ దాత్రి న్యూస్)
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి తిరుపతి. తిరుచానూరుకు చెందిన సూర్య పవన్ కుటుంబ సభ్యులు శనివారం స్వామి వారికి వెండి కవచాలు విరాళం (సర్వాంగ కవచం, తొండము, హస్తాలు, చెవులు,) సుమారు 12 కిలోలు, సుమారు విలువ 38,00,000/-రూపాయలు, విలువగల వెండి ఆభరణాలు అందించి వారి భక్తిని చాటుకున్నారు. వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ దేవస్థానం చైర్మన్ మణి నాయుడుఈ కార్యక్రమంలో ఏఈఓ ధనపాల్, సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు