GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:31 pm Digital Edition : GURU SWAMY

కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

పలమనేరు, ఆగస్టు03 ( గరుడ ధాత్రి ) :

స్థానిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. స్వామివారికి వేకువ జామున నుండి అభిషేకాలు విశేష పూజలను అర్చకులు కుమార్, చంద్రమౌళి శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలతో స్వామి వారిని ప్రత్యకంగా అలంకరిం చారు. అనంతరం దాత ఆలయ వైస్ చైర్మన్ మంజునాథ్ సహకారంతో ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ లోకేష్ వర్మ, ఆలయ చైర్మన్ మురళీకృష్ణ కమిటీ సభ్యులు ఎంటిఆర్ ప్రసాద్, రెడ్డప్ప, బాబు, వీరప్ప, సుజాత, మోహనప్రియ తదితరులు పాల్గొన్నారు.