బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్15
బైరెడ్డిపల్లి మండలంలోని ధర్మపురి పంచాయతీకి సంబంధించిన కోమటివాని చెరువు స్థలంలోఆదివారం కొందరు అధికారులు ఉండరు అన్న ఆలోచనతో రాతికూసాలు నాటి ఆక్రమణలు కు శ్రీకారం చుట్టారు. ఈ సమాచారం గ్రామస్థులు రెవిన్యూ అధికారులకు పిర్యాదుచేశారు.ఈ నేపథ్యంలో ఆర్.ఐ.ధమోదరాచారి,వి.ఆర్.ఓ.వెంకటేష్,
సర్వైయర్ ప్రసాద్ రెడ్డి తదితరులు సోమవారం సంఘటన స్థలం చేరుకొని ఆక్రమణలు గుర్తించారు.ఆక్రమణలు వెంటనే తొలగించాలని లేనిచో చట్టపరంగా తొలగిస్తామని ఆక్రమణధారునికి స్పష్టంచేశారు.దీనితో తానే స్వచ్ఛందంగా తొలగిస్తామని రెవిన్యూ అధికారులకు తెలపడంతో అధికారులు వెనుతిరిగారు.గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసి అధికారులు కు కృతజ్ఞతలు తెలియజేశారు.