సత్యవేడు గంగ జాతర మహోత్సవంలో భాగంగా శ్రీ సిటీ ఎండి డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి , ఆయన కుమార్తె నిరోష తో కలిసి గురువారం రాత్రి సత్యవేడు గంగమ్మను దర్శించుకున్నారు ఈయనకు ఆలయ ధర్మకర్త గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు కాయ కర్పూర హారతులు చెల్లించి అమ్మవారిని ఎండి దర్శించుకున్నారు గోపీనాథ్ రెడ్డి ఎండికి దగ్గరుండి దర్శనాలు చేయించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి మర్యాదలు కూడా చేశారు కుల రహిత స్నేహభావాలకు ప్రతీకగా పట్టణ సామరస్య వాతావరణంలో ప్రతి ఏడాది సత్యవేడులో గంగమ్మ వేడుకలు ఆనవాయితీగా జరగడం ఎంతో సంతోషదాయకమన్నారు తాను కూడా ప్రతి ఏడాది గంగ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం ఆనందదాయకమన్నారు