చిత్తూరు రైల్వే స్టేషన్ ను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం -ఎంపీ దగ్గుమళ్ళ‌

గరుడధాత్రి : జిల్లా కేంద్రంలోని చిత్తూరు రైల్వే స్టేషన్ను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈస్ట్ కోస్టల్ పరిధిలోకి చిత్తూరు రైల్వే స్టేషన్ రావడం హర్షణీయమన్నారు. ఇందుకు సహకరించిన దేశ ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రులకు ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రుల దశాబ్దాల కలకు సాకారం అయిన నేపథ్యంలో సోమవారం నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావించిఃది. ఈ సందర్భంగా చిత్తూరు...