GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 7:56 am Posted by : GARUDA DHATRI NEWS

చిరు వ్యాపారి గోపి హఠాన్మరణం

పిచ్చాటూరులో గత 25 ఏళ్లుగా వ్యాపారం చేస్తూ అందరికీ సుపరిచితుడు ఆయన ఎం.గోపి సోమవారం హఠాన్మరణం చెందారు.
గోపి పది రోజుల క్రితం ఆదివారం రోజున తన మోటార్ సైకిల్ పై వెళ్తూ పెట్రోల్ బంక్ వద్ద అదుపుతప్పు బోల్తా పడ్డారు.
ఈ రోడ్డు ప్రమాదంలో గాయాల తో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
గోపి స్వగ్రామం కొప్పేడు లో మంగళవారం ఉదయం 9.00 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
గోపి మృతి పట్ల పిచ్చాటూరు లోని వ్యాపారస్తులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.