GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 3:03 pm Digital Edition : GURU SWAMY

జిల్లా బిజెపి ఇన్చార్జిను ఘనంగా సత్కరించిన నేతలు

కుప్పం,జులై 02 (గరుడ ధాత్రి న్యూస్):
చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన ఇన్చార్జిగా నియమితులైన అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించినట్లు కుప్పం నియోజకవర్గ బిజెపి నేతలు తెలిపారు. బుధవారం చిత్తూరులో జరిగిన ప్రత్యేక సమావేశం తో ఆయనను సత్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో సర్ కార్యక్రమం లో బి ఎల్ ఏలు చురుకుగా పాల్గొనాలని కోరినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి పార్టీలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారని తెలిపారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి జి. విజయ్ కుమార్, కుప్పం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ తులసినాథ్, అట్లూరి శ్రీనివాసులు మరియు బిఎల్ఎ వన్ లు పాల్గొన్నారు.