GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 7:44 am Digital Edition : GURU SWAMY

తల్లిపాలతో సంపూర్ణ ఆరోగ్యం సూపర్వైజర్ రోజా రమణి

కార్వేటినగరం ఆగస్టు 5 (గరుడదాద్రి న్యూస్):
బిడ్డ పుట్టిన అర్ధగంటలోపే ముర్రిపాలు తాగి పట్టిస్తే అదే వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుందని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని అంగన్వాడీ సూపర్వైజర్ రోజా రమణి అన్నారు.కార్వేటినగరం మేజర్ పంచాయతీ శివాలయం వీధిలో గల అంగన్వాడీ కేంద్రంలో ప్రాజెక్టు పరిధిలో గల నాలుగు అంగన్వాడి కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. సూపర్వైజర్ మాట్లాడుతూ ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, బిడ్డ పుట్టిన అర్ధగంట లోపు తల్లిపాలను అందించాలని, కూర్చొని పాలు ఇవ్వాలని, బిడ్డకు రెండు సంవత్సరాల వయసు వచ్చేవరకు తల్లికిపండ్లు,ఆకుకూరలు,గుడ్లు వంటి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించి తల్లిపాలు ద్వారా బిడ్డ ఆరోగ్యకరంగా ఎదుగుదలకు ధోహద పడుతుందన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు వైద్య సిబ్బంది ఆశవర్కర్ లు,తల్లులు, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.