GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:29 am Digital Edition : GURU SWAMY

తెప్పలపై విహరించిన సుబ్రహ్మణ్య స్వామి

కార్వేటి నగరం ఆగస్టు 7 (గరుడదాద్రి న్యూస్)
కార్వేటి నగరం కుమారగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృతిక సందర్భంగా శుక్రవారం ఆలయంలో స్వామి అమ్మ వాళ్లకు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం వైభవంగా స్వామి అమ్మవార్లకు వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లు తిరుచి వాహనపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు కర్పూర హారతిలిచి మొక్కులు తీర్చుకున్నారు. గుండు గురు స్వామి వీధి వీధిలో ఉన్న గిరిజనులు స్వామివారికి వరుస సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రామ్ శెట్టి రాజశేఖర్, కార్యనిర్వ కార్యదర్శి కృష్ణ నాయక్, కమిటీ సభ్యులు ఎర్రగోటి రాధాకృష్ణ యాదవ్, గోవిందస్వామి, వినయ్, సెల్వి అమరావతి తులసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.