తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు!
హైదరాబాద్:ఏప్రిల్
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పుర స్కరించుకొని 27వ తేదీన ప్రతి నియోజకవర్గా ల్లో, జిల్లా కేంద్రాల్లో,పార్టీ జెండాలను ఎగురవేయాల ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చా రు. ఇవ్వాలా పార్టీ శ్రేణులతో కేటీఆర్,టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ఇక స్పీడ్ పెంచా ల్సిందే. ఇటు అధికార కాంగ్రెస్ను..ఇటు కవిత పార్టీని టార్గెట్ చేస్తూ… దూకుడు పెంచాల్సిందేనని డిసైడ్ అయిందట గులాబీ పార్టీ.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని గులాబీ బాస్ డిసైడ్ చేశారట. ఈనెల 27న పార్టీ ఆవిర్భావ వేడు కల ముగింపు సమావేశం లో కేసీఆర్ కీలక నిర్ణయా లు ప్రకటించబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ పేరును టీఆర్ఎస్గా మార్చాలన్న డిమాండ్ నేపధ్యంలో ఊహించని మార్పులు ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక పోరుబాటే అంటోంది బీఆర్ఎస్. ఇప్పటికే కాంగ్రె స్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడువు