GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:34 pm Digital Edition : GURU SWAMY

త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ.. పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి ?

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా అచ్చెన్న..!

అమరావతి :

ఏపీలో రానున్న కాలంలో టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మంత్రివర్గ విస్తరణ, పార్టీలో మార్పులు చేర్పులు ఉండొచ్చని చెబుతున్నారు. ఉత్తరాంధ్రా రాజకీయాల్లో టీడీపీ జోరు పెంచింది, పరిశ్రమలు తీసుకువస్తూ ప్రజలకు చేరువవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని టీడీపీ చూస్తోంది. ఈ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు. విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడికి రాష్ట్ర టీడీపీ పార్టీ పగ్గాలు అప్పగించవచ్చని వినిపిస్తోంది.