GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 8:41 pm Digital Edition : GURU SWAMY

నిరంతరం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం పై ఆలోచించే సి.ఎం.చంద్రబాబు ఉండడం గర్వకారణం

రాష్ట్ర టి.డి.పి.నాయకుడు రఘుచంద్ర గుప్త

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు2

కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి అయిన సందర్బంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గత 4 రోజులుగా విస్తృతంగా ఇంటి ఇంటికి కరపత్రాలు ను
రాష్ట్ర టి.డి.పి.వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి రఘుచంద్ర గుప్త అందించి పార్టీకి ఎల్లపుడు మీ ఆశీస్సులు అందించి సహకరించాలని ఆయనకోరారు .నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి కృషి గురించి ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనకు ఉండడం గర్వించదగ్గ విషయమని ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్రం లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలుచేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు కె సాధ్యం అని ఆయన తెలిపారు. ఖజానా కాళీచేసి ,అభివృద్ధి ని పట్టించుకోని గతవైకాపా ప్రభుత్వ తీరును ఆయన పేర్కొని ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలనుప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.