పిచ్చాటూరు ఆగస్టు 15 గరుడధాత్రి:
మువ్వన్నెల జెండా రెపరెపలాడగా.. దేశభక్తి స్ఫూర్తితో పిచ్చాటూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.