GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 8:39 am Posted by : GURU SWAMY

పునరుత్పాదక ఇంధన రంగంలో ‘ఆంధ్రప్రదేశ్’ ఆల్ టైమ్ రికార్డ్

కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్):

హరిత ఇంధన ( గ్రీన్ ఎనర్జ) ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ లోక్ సభలో విడుదల చేసిన అధికారిక నివేదిక ఏపీ ఏకంగా 3,865.63, (2025-26) మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో నమోదైన 1,085.15 మెగావాట్లతో పోలిస్తే ఇది దాదాపు నాలుగు రెట్లు అధికం కావడం విశేషం. పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతులు, ఇన్వెస్టర్-ఫ్రెండ్లీ వాతావరణం కారణంగానే ఈ రికార్డు స్థాయి పురోగతి సాధ్యమైందని నివేదిక స్పష్టం చేసింది. ఎన్ఆర్ఈడి క్యాప్ సమర్థవంతమైన కార్యాచరణతో రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే ముందంజలో నిలిచింది.