పులి దాడిలో నలుగురు మహిళలు మృతి
గరుడధాత్రి :
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పులి దాడి కలకలం రేపింది…
సంధ్య వాహి తాలూకాలోని అటవీ ప్రాంతంలో తూనీకాకు (బీడీ ఆకు) సేకరణకు వెళ్లిన 13 మంది మహిళలపై పులి దాడి చేసింది
ఈ ఘటనలో నలుగురు మహిళలు చనిపోయారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కాగా ఈ ఏరియాలో పులి సంచారం ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు
ఉదయం 8 గంటలకు అటవీ ప్రాంతంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది