పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను యజమానికి అప్పగించిన కుప్పం ఆర్టీసీ సిబ్బంది

కుప్పం,ఆగస్టు 23 (గరుడ ధాత్రి న్యూస్) ప్రయాణికుల భద్రతతో పాటు వారి వస్తువుల సంరక్షణలోనూ ఆర్టీసీ సిబ్బంది చూపుతున్న బాధ్యత, నిజాయితీకి మరో నిదర్శనం చోటుచేసుకుంది.బస్సులో ప్రయాణ సమయంలో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను ఆర్టీసీ సిబ్బంది గుర్తించి భద్రపరిచారు. అనంతరం డిపో మేనేజర్ ఆర్.రవి చొరవతో సెల్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించి, అసలు యజమానిని గుర్తించారు. తదనంతరం సదరు సెల్‌ఫోన్‌ను యజమానికి సురక్షితంగా అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా సెల్‌ఫోన్ యజమాని ఆర్టీసీ సిబ్బంది చూపిన నిజాయితీ, బాధ్యతాయుతమైన సేవాభావాన్ని అభినందిస్తూ ప్రత్యేకంగా...