GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 3:44 pm Digital Edition : GURU SWAMY

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను సద్వినియోగం చేసుకోండి

ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో  నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ శారదా దేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మే 4వ తేది సోమవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10.30 నుండి 11.30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పోన్ ద్వారా పిర్యాదులు చేసేవారు 0877-2227208 కి కాల్ చేసి మాట్లాడవచ్చని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు ఇంచార్జి కమిషనర్ శారదా దేవి తెలియజేశారు.అర్జీదారులు వినతిపత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి, పనిచేయు ఫోన్ నంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు.