GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 5:38 pm Digital Edition : GURU SWAMY

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు – కమిషనర్ జయకృష్ణ

ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను ఈనెల 14వ తేదీ వినాయక చవితి పండుగ సందర్బంగా రద్దు చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ, ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి పండుగ సోమవారం నిర్వహించడం వలన పి.జి.ఆర్.ఎస్. రద్దు చేశామని కావున ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని తెలిపారు. రానున్న సోమవారం యధావిధిగా డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరుగుతుందని తెలిపారు.