GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 9:06 pm Posted by : GARUDA DHATRI NEWS

ప్రతి ఓటరు ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమంలోపాల్గొనాలి

-సహాయ ఎన్నికల నమోదు అధికారి మండ ల తహసీల్దార్. ప్రసన్నకుమార్

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్13

భారత ఎన్నికల కమీషన్ వారి ఆదేశాలు మేరకు ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు పాల్గొనాలి. అనిసహాయ ఎన్నికల నమోదు అధికారి మండ ల తహసీల్దార్. ప్రసన్నకుమార్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 15 వ తేదీ నుండి జులై 14 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో కు సంబంధించి ప్రతి గ్రామం నందుప్రతి ఓటర్ కు సంబంధించి సమగ్ర విచారణ జరపబడునున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి
ఓటరు ఒక ఎన్నుమ రేషన్ ఫారం సంభధిత బి.ఎల్.ఓ.కు సమర్పించాలని అన్నారు.కావున ఓటరు ఈ ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత బూత్ లెవెల్ అధికారికి సహకరించి జయప్రదం చేయాలని ఆయన కోరారు.గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొని అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు.