GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 12:59 am Digital Edition : GURU SWAMY

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం

కార్వేటినగరం ఆగస్టు 11 గరుడదాద్రి న్యూస్
కార్వేటి నగరం మండలం కార్వేటినగరం రైతు సేవ కేంద్రం నందు మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరి రాగి కంది పంటలకు సంబంధించి ఇన్సూరెన్స్ చేసుకోవడం గురించి రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డీజీఎం నాబార్డ్ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ నాబార్డ్ తిరుపతి షేక్ ఇన్సూన్ చిత్తూరు సాగర్ టాటా ఏఐజి ఇన్సూరెన్స్ కంపెనీ క్లస్టర్ మేనేజర్ టాటా ఏసీ డిస్టిక్ కోఆర్డినేటర్ మరియు ఇండియన్ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్లు మరియు రైతులు, వ్యవసాయ విస్తరణాధికారులు
హేమాద్రి,గాయత్రి .రైతు సేవ కేంద్రం సిబ్బంది చైతన్య,సుమ, ప్రియ
వెంకటేష్ పాల్గొనడం జరిగింది.వరి పంటకు ఆగస్టు 15 లోపల ఎకరానికి 840 ఇన్సూరెన్స్ చెల్లించుకోవాలి. పంట నష్టం వాటిలితే ఎన్ని లో ఎఫెక్ట్ వల్ల మండలాన్ని యూనిట్ గా చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ వారు రైతులకు భీమా చెల్లించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ శాఖ సిబ్బంది బ్యాంక్ మేనేజర్లు నాయకులు పాల్గొన్నారు.