GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 7:00 pm Posted by : GURU SWAMY

ప్రమాదం లో గాయపడి చికిత్స పొందుతున్నకొళాయి నజీర్ బాషా మృతి

-నివాళులు అర్పించిన పలువురు రాజకీయ నాయకులు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్21

బైరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొళాయి నజీర్ భాష ఆదివారం మృతి చెందారు.ఆయన శుక్రవారం బైరెడ్డిపల్లి లో కొనసాగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడం విదితమే.ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారంమృతి చెందారు. బైరెడ్డిపల్లి గ్రామపంచాయతీ లో సుదీర్ఘంగా 35 సంవత్సరాలకు పైగావాటర్
మ్యాన్ గా సేవలందించి త్రాగునీటి సమస్య లేకుండా అత్యుత్తమ సేవలు అందించారు. ఆయన భౌతికకాయాన్ని బైరెడ్డిపల్లి మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు సందర్శించి నివాళి అర్పించారు. ఆదివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.