మేనకూరు, జూన్ 23 గరుడధాత్రి న్యూస్:
మేనకూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రజినీకాంత్ మరణించిన విషయం తెలుసుకున్న సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య మేనకూరులోని వారి స్వగృహానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రజనీకాంత్ సేవలను కొనియాడారు.
అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.