సత్యవేడు నియోజకవర్గం బి.ఎన్. కండ్రిగలో నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో నాగలాపురం మండల వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.