బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్19
బైరెడ్డిపల్లి లోని ఆర్యవైశ్య ల ఆరాధన దైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం ను అర్చకులు రామకృష్ణమాచార్యులు చే కొనసాగింది.సాయంత్రం అమ్మ వారి గుడిలో ఊంజలి సేవ,శ్రీ వాసవి మహిళా మండలి సభ్యులచే అష్టలక్ష్మి స్తోత్రం, దేవి ఖడ్గమాల స్తోత్రం పటించారు. ఎనిమిది గంటలకి మహా మంగళహారతి కొనసాగింది. ఈ కార్యక్రమంలో
ఉభ య దారులు గా ఉమా దేవ, కృష్ణమోహన్ కుటింభికులువ్యవహరించారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే బైరెడ్డిపల్లి గ్రామ దేవత శ్రీ భాటగంగమ్మ ఆలయంలో అర్చకులు నాగేంద్ర ప్రసాద్ స్వామి చే అభిషేకం,విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయదార్లు, భక్తులు పాల్గొన్నారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.