GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 8:16 pm Digital Edition : GURU SWAMY

బైరెడ్డిపల్లెలో జానకమ్మ స్మారక అవార్డులుతో అంతర్రాష్ట్ర కళాకారులకు ఘనసత్కారం

బైరెడ్డిపల్లె గరుడదాత్రి ఆగస్టు9

బైరెడ్డిపల్లె మండలంలోని శ్రీ ముని నారాయణ డిగ్రీ కళాశాలలో జానకమ్మ స్మారక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సమాజ సేవతో పాటు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని
ఈసందర్భంగా సన్మానించారు.
సమాజ సేవలో విశేష సేవలందించిన పగడాల మధుసూధన్‌రావుకు జానకమ్మ స్మారక పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. సమాజ సేవ, కళా రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.
పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి విచ్చేసిన కళాకారులను కూడా కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. కళలకు, సాంస్కృతిక సంప్రదాయాలకు సరిహద్దులు లేవని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వివిధ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, పరస్పర సహకారం మరింత బలోపేతమవుతాయని వక్తలు పేర్కొన్నారు.ఈ
కార్యక్రమంలో చిరంజీవి, డాక్టర్ ఏడుకొండల యాదవ్, సత్య సంచార జాతలా బైరెడ్డిపల్లిమండల అధ్యక్షులు.ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.