మర్రిమానుచేను గ్రామంలోఘనంగా శ్రీ మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్24 బైరెడ్డిపల్లి మండలం లోనిమర్రిమానుచేను గ్రామంలో శ్రీ మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం బుధవార ఘనంగా గ్రామస్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం గణపతి పూజ,వేధపారాయణం,గోపూజ,యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ట,,వివిధ హోమాలు,పంచామృత అభిషేకం,అలంకరణ,విశేష అర్చన,శాంతి కల్యాణం, మహా కుంభాభిషేకం, భక్తులకుతీర్థ ప్రసాదాలు వితరణ కొనసాగింది.ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి మండల టి.డి.పి.అధ్యక్షుడు కిషోర్ గౌడు,పలమనేరు నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు భువన చంద్ర గౌడు,పాల్గొన్నారు. నిర్వాహకులు వారికి స్వాగతం పలికి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే వైకాపా రాష్ట్ర కార్యదర్సులు మొగసాల కృష్ణమూర్తి,మొగసాల...