గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో మహానాడు వేడుకల సందర్భంగా సురటపల్లి ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్, యూనిట్ ఇన్చార్జ్ అయిన నెల్సన్ మండేలా ను ఘనంగా సత్కరించారు. మండల పార్టీ అధ్యక్షులు టిజెబి ప్రణీత్ రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జ్ శ్రీనివాస్ యాదవ్ కలిసి దుశాలువ కప్పి, గజమాలతో అభినందనలు తెలిపారు.
పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు నెల్సన్ మండేలా గ చేస్తున్న సేవలు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. మహానాడు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.