GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 9:26 pm Digital Edition : GURU SWAMY

మహిళలు రాజకీయాల్లోకి రావాలి- కల్వకుంట్ల కవిత

మహిళలు రాజకీయాల్లోకి రావాలి- కల్వకుంట్ల కవిత!

యువత, మహిళలు, రాజకీయా ల్లోకి రావాలని తెలంగాణ ప్రజల రక్షణే ధ్యేయంగా తెలంగాణ రక్షణ సేవ పనిచేస్తుందని, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
బుధవారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని కేసారంలో నిర్వహిస్తు న్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహో త్సవం,తో పాటు.. పెద్దమ్మ తల్లి దేవాల యాలను సందర్శించి, ఆమె మాట్లాడారు.
యువత, మహిళలు, రాజకీయాల్లోకి వచ్చి, చైతన్యంతో ప్రశ్నించే తత్వాన్ని,పెంపొందించుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆమె, ప్రజలకు వైద్య, విద్య, ఉచితంగా అందిస్తామని అన్నారు.మహిళా సాధికారత, నిరుద్యోగ సమస్యల పరిష్కారం, మరియు సామాజిక తెలంగాణ కోసం యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టా లని, ఇందుకోసం జాగృతి వేదికగా శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు