శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న పగడాల శ్రీ వైష్ణవికి డాక్టరేట్ లభించింది. ఈమెకి వెల్లూరు లోని వేల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. బిగ్ డేటా అనలిటిక్స్ ఫర్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ పర్ఫామెన్స్ మోడలింగ్ బై యూజింగ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ అనే అంశంపై ప్రొఫెషర్ డి.అజూ పర్యవేక్షణలో చేసిన పరిశోధనలకు ఈ డాక్టరేట్ డిగ్రీ లభించింది. ఈ మేరకు ఆ సంస్థ పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు.