నాగలాపురం మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన పామాంజీ మురళి అలియాస్ కోళ్ళ చిన్నా ను సత్యవేడులోని కుమ్మరి గుంటకు చెందిన యువత ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి, పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కోళ్ళ చిన్నా మాట్లాడుతూ, సత్యవేడు ప్రాంత యువతకు, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తాను ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.
తనకు ఈ పదవి లభించేందుకు కృషి చేసిన సత్యవేడు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సత్యవేడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శివకుమార్ కి,పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.