GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 8:33 am Digital Edition : GURU SWAMY

రీ సర్వేలో అక్రమాలు చేస్తూ లంచాలు తీసుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి ..సిపిఎం

నాగలాపురం గరుడధాత్రి న్యూస్ :
నాగలాపురం మండలంలో రి సర్వేలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని రైతుల వద్ద లంచాలు తీసుకుంటున్న స సర్వేయర్ విఆర్ఓ లపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా కార్యదర్శి వరకు సభ్యులు దాసరి జనార్ధన్ లో డిమాండ్ చేశారు.
మండలంలోని వేoబాకం గ్రామంలో రైతులు విద్యుత్ సర్వీసులకు కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి 4000 రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారని జనార్ధన్ తెలిపారు ఆరుగాలం కష్టపడి మద్దతు ధర లేక గిట్టుబాటు ధర లేక పంటలకు పెట్టుబడులు పెరిగి అప్పుల పాలవుతున్న రైతాంగాన్ని లoచాల పేరుతో పీల్చి పిప్పి చేస్తున్న విఆర్ఓ లను సర్వేర్లపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రీ సర్వే జరుగుతున్న అన్ని గ్రామాల్లో కూడా రైతులకు ఆశ చూపి సాగులో ఉన్న భూములు నమోదు చేస్తామని వేల రూపాయలను లంచాలుగా డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు తక్షణ తాసిల్దారు ఆర్డీవోలు స్పందించి విఆర్వోలు సర్వేర్లపై విచారించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు