GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 7:49 am Digital Edition : GURU SWAMY

రోజు కూలీ చేసుకొంటూ జీవనం సాగించే వ్యక్తి ఆత్మహత్య

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు5

బైరెడ్డిపల్లి మండలం లోని కడపనత్తం గ్రామంలో కూలి చేస్తూ ఒంటరిగా నివసిస్తున్న కృష్ణమూర్తి (54) బుధవారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగుచూసింది.
అను నిత్యం కల్మషo లేకుండా అందరితో ప్రేమాభిమానాలు పంచుకొనే వ్యక్తి
కూలీల నోటా నవ్వులు పండించే వ్యక్తి ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకొన్నాడంటే ఇది నమ్మలేని నిజం అంటున్నారు స్థానికులు .బుధవారం సాటికూలీలు కృష్ణమూర్తి ఎంతసేపటికి రాలేదని ఆయన ఇంటి వద్దకు వెళ్లగా ఆత్మహత్య చేసుకొనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈనేపథ్యంలో పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సివుంది.