వజ్రవేలు మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటు -నూకతోటి రాజేష్
✒️నాగలాపురం మండలం ఎస్ఎస్పురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత వజ్రవేలు శనివారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
సమాచారం అందుకున్న సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ గ్రామానికి చేరుకుని వజ్రవేలు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రవేలు పార్టీకి అంకితభావంతో సేవలందించిన నిబద్ధత కలిగిన నాయకుడని, ఆయన మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాజేష్ అన్నతో పాటు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.