వర్షం కోసం రైతన్న ఎదురుచూపులు.. ఉసూరుమంటున్న వరుణుడు
ఎల్నినో ప్రభావంతో బీడువారుతున్న భూములు.. ఆందోళనలో అన్నదాత బైరెడ్డిపల్లి, ఆగస్టు 02 గరుడదాత్రి బైరెడ్డిపల్లి మండలంలో వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. సాగుకు సిద్ధంగా ఉన్న భూములు దుక్కి కూడా దున్నలేని పరిస్థితి నెలకొనడంతో పొలాలు బీడుగా మారి రైతన్నను కలవరపెడుతున్నాయి. ప్రతి ఏడాది ప్రభుత్వం అందించే రాయితీ వేరుశెనగ విత్తనాల కోసం రైతులు పెద్దఎత్తున ఆసక్తి చూపేవారు. అయితే ఈసారి వర్షాలు లేకపోవడంతో...