GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 5:15 am Digital Edition : GURU SWAMY

వాలీ బాల్ చేసిన తంటా.. కాలనీ అంతా గొడవలు

ఎస్.ఐ.చందనప్రియ కౌన్సిలింగ్ తో సద్దు మణిగింది

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు22

బైరెడ్డిపల్లి మండలం లోని గౌనీతిమ్మినేపల్లి లోఇటివలన కాలననీ కి చెందిన యువకులు వాలీబాల్ క్రీడా పోటీలు జరుపుకున్నారు. ఈ పోటీల్లో యువకుల మధ్య మనస్పర్థలు వచ్చాయి.15 రోజులుగా చాప కింద నీరు లా రాసుకొంటున్న ఈ గోడవలు శనివారం రాత్రి ఊపుఅందుకొన్నది ఈ నేపథ్యంలో యువకుల తల్లులు జ్యోక్యము చేసుకోగా రెండు వర్గాలు మహిళలు పై చేయి చేసుకున్నది.కాలనీలో యువకుల మధ్య గోడవలు పెద్దల వరకు దారి తీయడంతో కాలనీ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నరికేస్తాం, చంపేస్తాం అంటూ కొంతమంది తమ పిల్లలకు వాట్సప్ ల్లో సందేశాలు పెట్టారని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమాచారం తెలుసుకున్న బైరెడ్డిపల్లి ఎస్.ఐ.చందన ప్రియ తన సిబ్బంది తో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని
ఇరు రువర్గాలకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.