GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 7:00 am Digital Edition : GURU SWAMY

వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేకపూజలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు8

బైరెడ్డిపల్లి మండలంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి అలయంలలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని కడపనత్తం గ్రామంలో వెలసిన
శ్రీ నల్గొండరాయస్వామి ఆలయంలో,మండలంలోని మురారిపల్లి లో నెలకొన్న శ్రీ ఓబులేశ్వరస్వామి అలయంలలో శనివారం అర్చకులు రామకృష్ణమాచార్యులు,తిప్పాచార్యులు బృందంచే ఆయా ఆలయాల్లో పంచామృత అభిషేకం, విశేషపూజలు చేపట్టి మహామంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కడపనత్తంలో నల్గొండరాయస్వామి ఆలయంలో పూజలు,అభిషేకం కు ఉభయదారులుగా కుప్పనపల్లి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, చిక్కప్ప కుటింభికులు వ్యవహరించారు. .