కార్వేటి నగరం ఆగస్టు 23 గరుడదాద్రి న్యూస్
కార్వేటి నగరం వెలసిన రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని కోరుతూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి మాల కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ పొన్న యుగంధర్ ఆదివారం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళలో నాటు వైద్యం కోసం వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.