చౌడేపల్లి సెప్టెంబర్ 04 గరుడ దాత్రి న్యూస్
చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శ్రావణమాసం కృష్ణాష్టమి శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకరాలు శ్రావణి అమ్మవారికి , అభయాంజనేయ స్వామికి, నాగ భైరవ స్వామి కి,ఉదయమే పంచామృత అభిషేకం చేసి రంగురంగు పూలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పుంగనూరు ,చౌడేపల్లికి చెందినవారు .అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో సౌందర్యలహరి పారాయణం చేశారు .ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.